2020లో రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మృతుల సంఖ్య
- March 10, 2021ఖతార్: ఖతార్లో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన సంఖ్య తగ్గిందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. 2019లో 154 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందితే..2020లో ఆ సంఖ్య 138కి తగ్గటం ఊరటనిచ్చే అంశమని అధికారులు పేర్కొన్నారు. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన 138 మందిలో 69 మంది మోటరిస్టులు, 26 మంది ప్రయాణికులు, 43 మంది పాదాచారులు అని వెల్లడించారు. 2015 నుంచి గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే యాక్సిడెంట్ మృతుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, 2015లో 227 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే..గతేడాది 138 మంది చనిపోయారని తెలిపారు. గతేడాది జరిగిన యాక్సిడెంట్లలో 90.1 శాతం మైనర్ యాక్సిడెంట్లేనని, 8.2 సీరియస్ యాక్సిడెంట్లుకాగా..1.7 శాతం మంది మృతిచెందారని ట్రాఫిక్ విభాగం అధికారులు పేర్కొన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇతర వాహనాలతో తగిన డిస్టెన్స్ మెయిన్టేట్ చేయకపోవటం కారణంగానే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్