2020లో రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మృతుల సంఖ్య

- March 10, 2021 , by Maagulf
2020లో రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మృతుల సంఖ్య

ఖతార్: ఖతార్లో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన సంఖ్య తగ్గిందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. 2019లో 154 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందితే..2020లో ఆ సంఖ్య 138కి తగ్గటం ఊరటనిచ్చే అంశమని అధికారులు పేర్కొన్నారు. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన 138 మందిలో 69 మంది మోటరిస్టులు, 26 మంది ప్రయాణికులు, 43 మంది పాదాచారులు అని వెల్లడించారు. 2015 నుంచి గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే యాక్సిడెంట్ మృతుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, 2015లో 227 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే..గతేడాది 138 మంది చనిపోయారని తెలిపారు. గతేడాది జరిగిన యాక్సిడెంట్లలో 90.1 శాతం మైనర్ యాక్సిడెంట్లేనని, 8.2 సీరియస్ యాక్సిడెంట్లుకాగా..1.7 శాతం మంది మృతిచెందారని ట్రాఫిక్ విభాగం అధికారులు పేర్కొన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇతర వాహనాలతో తగిన డిస్టెన్స్ మెయిన్టేట్ చేయకపోవటం కారణంగానే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని వివరించారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com