కర్నూలు ఎయిర్పోర్టు లో రాకపోకలు షురూ!
- March 28, 2021కర్నూల్: కర్నూల్లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టు నుండి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి.
బెంగుళూరు నుండి కర్నూల్ కు తొలి విమానం ప్యాసింజర్లతో ఆదివారం నాడు చేరుకొంది. 52 మంది ప్రయాణీకులతో బెంగుళూరు నుండి కర్నూల్ కు ఇవాళ విమానం చేరుకొంది.
ఈ విమానంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేరుకొన్నారు. బెంగుళూరు నుండి కర్నూల్ కు 6ఈ7911 నెంబర్ విమానం చేరుకొంది. 52 మందితో తొలి విమానం కర్నూల్ కు చేరుకోవడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.
మరో వైపు ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు కర్నూల్ ఎయిర్ పోర్టు నుండి విశాఖపట్టణానికి తొలి విమానం బయలుదేరింది. రెండు రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఈ ఎయిర్ పోర్టుకు పెడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ ఎయిర్ పోర్టు నుండి త్వరలోనే అన్ని ప్రాంతాలకు కూడ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!