స్పోర్ట్స్ యాక్టివిటీస్ రద్దుపై క్లారిటీ ఇచ్చిన ఒమన్
- April 02, 2021
ఒమన్:దేశవ్యాప్తంగా క్రీడల నిర్వహణపై రద్దుకు సంబంధించి ఓమన్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి దేశంలో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ పై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వపరంగాను, ప్రైవేట్ పరంగాను ఇక నుంచి ఎలాంటి క్రీడల నిర్వహణకు అనుమతి ఉండదని వెల్లడించింది. ఇండోర్ స్టేడియం, ఔట్ డోర్ స్టేడియం, ఆర్టిఫిషియల్ గ్రీన్ గ్రాస్ కోర్టులలో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ రద్దు చేస్తున్నట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ తెలిపింది.కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ ఒకటి నుంచి క్రీడల పై నిషేధం అమల్లోకి వచ్చినట్లు తెలిపిన జి సి సి తదుపరి నోటీసులు వచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







