తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- April 02, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 965 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,741కి చేరింది.ఇందులో 3,01,876 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,159 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక రాష్ట్రంలో కరోనాతో కొత్తగా 5 మంది మరణించారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1706 కి చేరింది.రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నది.  ఇప్పటికే మాస్క్ ను తప్పనిసరి చేసింది.  

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com