‘ఎక్స్ఛేంజీ హౌస్’కి 496,000 దిర్హాముల జరీమానా
- April 22, 2021యూఏఈ: యాంటీ మనీ లాండరింగ్ - ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం మరియు ఇల్లీగల్ ఆపరేషన్స్ నిబంధనల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఓ మనీ ఎక్స్ఛేంజ్ సంస్థకు భారీగా జరీమానా విధించింది యూఏఈ సెంట్రల్ బ్యాంక్. మొత్తం 496,000 దిర్హాముల జరీమానా సదరు సంస్థ ఎదుర్కోనుంది. సదరు సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించిన దరిమిలా జరీమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 18న ఈ జరీమానా విధించారు. అయితే, ఆ సంస్థ పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఎక్స్ఛేంజ్ కార్యాలయాలపై ఎప్పటికప్పుడు నిఘా వుంటుందనీ, అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు కఠినంగా వుంటాయని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి. సెంట్రల్ బ్యాంక్ గతంలో రెండు సార్లు పలు సంస్థలకు ఇలాగే జరీమానాలు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..