ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 25, 2021అమరావతి: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీటీ స్కాన్, హెచ్ఆర్ సీటీ ధరను రూ.3 వేలుగా నిర్ణయించింది. అంతకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆస్పత్రులు, ల్యాబ్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సీటీ స్కాన్ వివరాలు, కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలను కరోనా డాష్ బోర్డులో నమోదు చేయాలని ఆదేశించింది.
కరోనా రోగి పేరు, ఫోన్ నెంబర్, సిటీ/హెచ్ఆర్ సీటీ స్కాన్ ఇమేజి, సీటీ స్కాన్ సైన్డ్ కాపీ వివరాలను డాష్ బోర్డులో నిక్షిప్తం చేయాలని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇది అమలయ్యేలా జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి