30 ఏళ్ళు పైబడినవారు వ్యాక్సిన్ పొందేందుకు అర్హులు
- May 19, 2021
దోహా: కోవిడ్ 19 వ్యాక్సిన్ పొందేందుకోసం ఇప్పటిదాకా నిర్దేశించిన వయసుని తగ్గించారు. ఇకపై 30 ఏళ్ళ వయసు పైబడినవారు కూడా వ్యాక్సిన్ పొందేందుకు అర్హులనీ, ఇది నేటి నుంచి అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తాజా ప్రకటనలో పేర్కొంది.ఈ పరిధిలోకి వచ్చేవారంతా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెబ్ సైట్ (www.moph.gov.qa) ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. ఇప్పటివరకు 2.1 మిలియన్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడం జరిగింది. గడచి 24 గంటల్లో 36,626 వ్యాక్సిన్లను వేయడం జరిగింది.కాగా, అర్హులైన జనాభాలో 53.8 శాతానికి వ్యాక్సినేషన్ అందించారు. 60 ఏళ్ళు పైబడిన 89.2 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు. కాగా 12 నుంచి 15 ఏళ్ళ మధ్యగల చిన్నారులకు ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ పొందడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







