వ్యాక్సిన్ పొంది ముంబై చేరుకునే వారికి నో క్వారంటైన్
- June 19, 2021
ముంబై: రెండు డోసలు వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఎయిర్ ఎయిండియా ఎక్స్ ప్రెస్ మరో ఊరట కలిగించే ప్రకటన చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు ఇండియన్ నేషనల్ క్యారియర్ ద్వారా ముంబై చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే..ఇది నేరుగా ముంబై చేరుకునే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. టాన్సిట్ ప్రయాణికులకు ఈ మినహాయింపు ఉండదు. క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందేందుకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ఇతర ఎయిర్ లైన్స్ లో ముంబై చేరుకునే వారు మాత్రం 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. వారం పాటు తమ సొంత ఖర్చుతో ఇన్సిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలి. మరో వారం తగిన జాగ్రత్తలతో హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







