వ్యాక్సిన్ పొంది ముంబై చేరుకునే వారికి నో క్వారంటైన్
- June 19, 2021
ముంబై: రెండు డోసలు వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఎయిర్ ఎయిండియా ఎక్స్ ప్రెస్ మరో ఊరట కలిగించే ప్రకటన చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు ఇండియన్ నేషనల్ క్యారియర్ ద్వారా ముంబై చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే..ఇది నేరుగా ముంబై చేరుకునే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. టాన్సిట్ ప్రయాణికులకు ఈ మినహాయింపు ఉండదు. క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందేందుకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ఇతర ఎయిర్ లైన్స్ లో ముంబై చేరుకునే వారు మాత్రం 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. వారం పాటు తమ సొంత ఖర్చుతో ఇన్సిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలి. మరో వారం తగిన జాగ్రత్తలతో హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









