వ్యాక్సిన్ పొంది ముంబై చేరుకునే వారికి నో క్వారంటైన్
- June 19, 2021
ముంబై: రెండు డోసలు వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఎయిర్ ఎయిండియా ఎక్స్ ప్రెస్ మరో ఊరట కలిగించే ప్రకటన చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు ఇండియన్ నేషనల్ క్యారియర్ ద్వారా ముంబై చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే..ఇది నేరుగా ముంబై చేరుకునే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. టాన్సిట్ ప్రయాణికులకు ఈ మినహాయింపు ఉండదు. క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందేందుకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ఇతర ఎయిర్ లైన్స్ లో ముంబై చేరుకునే వారు మాత్రం 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. వారం పాటు తమ సొంత ఖర్చుతో ఇన్సిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలి. మరో వారం తగిన జాగ్రత్తలతో హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







