ఆరేంజ్ బాక్సుల్లో కాప్టగన్ పిల్స్..పట్టుకున్న అధికారులు

- July 01, 2021 , by Maagulf
ఆరేంజ్ బాక్సుల్లో కాప్టగన్ పిల్స్..పట్టుకున్న అధికారులు

సౌదీ: జెడ్డా నౌకాశ్రాయం ద్వారా పెద్ద మొత్తంలో నిషేధిత కాప్టగన్ పిల్స్ స్మగ్లింగ్ చేసే ప్రయత్నానికి చెక్ పెట్టారు అధికారులు. ఆరేంజ్ బాక్సుల్లో అడుగున పిల్స్ పెట్టి అధికారుల కళ్లు గప్పేందుకు ప్రయత్నించారు స్మగ్లర్లు.అయితే..బాక్సులను స్కాన్ చేసిన తర్వాత అనుమానం వచ్చి పూర్తిగా చెక్ చేయటంతో కాప్టగన్ పిల్స్ బాగోతం బయటపడింది. 4.5 మిలియన్ల పిల్స్ ను అధికారులు గుర్తించారు. అయితే..ఇవి ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇదిలాఉంటే గత శనివారమే లెబనాన్ నుంచి 14.4 మిలియన్ల యాంఫేటమిన్ పిల్స్ ను అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన విషయం తెలిసిందే. ఇక గత ఏప్రిల్ లో దానిమ్మ పండ్ల బాక్సుల్లో 5.3 మిలియన్ల పిల్స్ స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు వాటిని పట్టుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com