విజయవాడ విమానాశ్రయం: ఈ నెల 15న నూతన రన్వే ప్రారంభం...
- July 01, 2021
విజయవాడ: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఏపీలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా అధునాతన రన్ వే నిర్మితమైంది. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎయిర్పోర్టు డైరెక్టర్ గిరి మధుసూదనరావు జిల్లా కలెక్టర్ను కలిసి విమానాశ్రయ విస్తరణ పనుల గురించి వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం 700 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు.ఈ పనులకు సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీకి జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.ఇంకా పెండింగ్లో ఉన్న భూసేకరణ, రహదారుల విస్తరణకు సంబంధించి రెవెన్యూ అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.విమానాశ్రయంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్లై ఓవర్కు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులను కోరారు.ఈ సమావేశంలో జీఎం మహ్మద్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









