ఎక్స్పో 2020: ఆయా దేశాల జాతీయ దినోత్సవ వేడుకలు వీక్షించే అవకాశం
- July 02, 2021
యూఏఈ: ఆరు నెలలపాటు జరిగే ఎక్స్పో 2020లో ఆయా దేశాలకు సంబంధించి జాతీయ దినోత్సవ వేడుకల్ని తిలకించే అవకాశం సందర్శకులకు కలగనుంది. అల్ వసల్ ప్లాజా ఈ వేడుకలకు వేదిక కానుంది. ఆయా దేశాలకు చెందిన జాతీయ పతాకాలు, జాతీయ గీతాలను ప్రదర్శించేందుకు అవకాశం వుంది. తమ తమ సాంస్కృతిక కార్యకలాపాలతో ఈ వేడుకలకు కొత్త శోభను అద్దనున్నారు ఆయా దేశాల ప్రతినిథులు. ఆయా జాతీయ దినోత్సవాల్ని నిర్వహించడానికి సాంకేతికంగా వీలుపడనివారు, హానర్ డే నిర్వహించుకునేందుకు వీలు పొందుతారు. ఒకే రోజు నేషనల్ డే, హానర్ డే వుంటే, ఉదయం ఒక వేడుక, సాయంత్రం ఇంకో వేడుక నిర్వహించుకోవచ్చు. 191 దేశాలకు చెందిన కళాకారులు ఈ ఎక్స్పోలో పాల్గొంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్, దివాలీ, చైనా కొత్త సంవత్సర వేడుకలు.. ఇలా చాలా ప్రత్యేకమైన వేడుకలు ఈ ఎక్స్పోలో అలరించనున్నాయి.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు