పని ప్రాంతాల్లో 100 శాతం సామర్థ్యం: సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి

- August 26, 2021 , by Maagulf
పని ప్రాంతాల్లో 100 శాతం సామర్థ్యం: సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి

అబుధాబి: అబుధాబి పని ప్రాంతాల్లో 100 శాతం వర్క్ ఫోర్స్ సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది.అబుధాబి ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ పొందిన ఉద్యోగులు, అలాగే వెసులుబాట్లు పొందినవారు తమ గ్రీన్ స్టేటస్, అల్హోసన్ యాప్ ద్వారా చూపించాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ పొందని ఉద్యోగులు కోవిడ్ 19 పరీక్షను ప్రతి ఏడు రోజులకు ఓ సారి చేయించుకోవాలి.టెస్టింగ్ చేయించుకోనివారికి పని ప్రాంతాల్లోకి అనుమతి వుండదు. వారికి యాన్యువల్ లీవ్ నుంచి కోతతోపాటుగా, నెలవారీ వేతనం నుంచి కూడా కోతలుంటాయి.వ్యాక్సినేషన్ పొందిన విజిటర్స్ అలాగే వినియోగదారులు గ్రీన్ స్టేటస్ చూపించాలి. వ్యాక్సినేషన్ పొందనివారు 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్ 19న పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ చూపించాలి.చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు రిమోట్ వర్కింగ్ సౌకర్యం కల్పిస్తారు.గ్రేడ్ 10 కంటే తక్కువ వయసున్నవారి తల్లిదండ్రులకు ఇది వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com