కాబూల్లో తీవ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- August 27, 2021
రియాద్: కాబూల్లో తీవ్రవాదులు బాంబు దాడులు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల బాంబు దాడులకు తీవ్రవాదులు పాల్పడగా పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్తాన్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది. ఆఫ్ఘాన్లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సౌదీ వెల్లడించింది. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది.
తాజా వార్తలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!









