దుబాయ్ 2020 కోసం దుబాయ్ మెట్రో సర్వసన్నద్ధమైంది.

- October 01, 2021 , by Maagulf
దుబాయ్ 2020 కోసం దుబాయ్ మెట్రో సర్వసన్నద్ధమైంది.

దుబాయ్: ఎక్స్‌పై ప్రాంతానికి వెళ్ళేందుకు మెట్రో రైడ్ విషయమై దుబాయ్ మీడియా హౌస్ ఓ వీడియో విడుదల చేసింది. శనివారం నుంచి ఆదివారం వరకు రెడ్ మరియు గ్రీన్ లైన్లలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1.15 నిమిషాల వరకు సర్వీసులు అందుబాటులో వుంటాయి. గురువారం సర్వీసులు ఉదయం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 2.15 నిమిషాల వరకు కొనసాగుతాయి. శుక్రవారం ఉదయం 8 గంటలనుంచి రాత్రి 1.15 నిమిషాల వరకు అందుబాటులో వుంటుంది. రూట్ 2020 మొత్తంగా 15 కిలోమీటర్ల మేర జబెల్ అలి మెట్రో స్టేషన్ నుంచి ఏడు స్టేషన్లను కలుపుతూ వుంటుంది. ప్రతిరోజూ 35,000 మంది సందర్శకులు ఎక్స్‌పో స్టేషన్ ద్వారా వెళతారని అంచనా. వారాంతాల్లో ఈ సంఖ్య 47,000కు చేరుకుంటుందని అంచనా.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com