తైవాన్లో భారీ అగ్నిప్రమాదం, 46 మంది మృతి
- October 14, 2021తైవాన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.కాహ్సియుంగ్ నగరంలోని 13 అంతస్తుల ఓ భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 46 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం(అక్టోబర్ 14) తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో తమకు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు కొందరు వెల్లడించారు.ప్రమాద కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.ప్రమాద సమయంలో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని ఫైర్ సిబ్బంది తెలిపారు.
అగ్నిప్రమాద దృశ్యాలు పొరుగునే ఉన్న మరో బిల్డింగ్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దాని ప్రకారం... మొదట ఆ భవనం మొదటి అంతస్తులోనే మంటలు చెలరేగాయి.ఆ తర్వాత క్షణాల్లోనే పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3గం. సమయంలో ఫైర్ సిబ్బందికి ప్రమాదంపై సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ భవనంలో మొత్తం 120 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 46 మంది మృతి చెందగా మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. మిగతావారి పరిస్థితేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం