స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచటం పై ప్రభుత్వం ఫోకస్
- October 24, 2021
బహ్రెయిన్: స్కూల్ ఎడ్యుకేషన్ సామర్థ్యాలను పెంపొందించడానికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సిద్ధమైంది. ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ లోని టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో కొత్త నియామకాలను చేపట్టనున్నట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజిద్ బిన్ అలీ అల్ నుయిమి చెప్పారు. లైఫ్ క్వాలిటీ, భాషా నైపుణ్యాలు మెరుగుదల, డిజిటల్ ఎంపవర్ మెంట్ స్పెషలిస్ట్స్, సోషల్, హెల్త్, అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సెలర్లు లాంటి కొత్త ఉద్యోగాలను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. వీటితో స్కూల్ ఎడ్యుకేషన్ నాణ్యత మెరుగవుతుందని, అలాగే స్కూల్ అనుబంధ వ్యవస్థలు కూడా బలోపేతం అవుతాయన్నారు. మొదటగా షైఖా మోజా బింట్ హమద్ అల్ ఖలీఫా సమగ్ర బాలికల పాఠశాల, రిఫా ఇంటర్మీడియట్ బాలుర పాఠశాల, అల్-ముస్తక్బాల్ ప్రాథమిక బాలికల పాఠశాల, ఉక్బా బిన్ నఫియా ప్రాథమిక బాలుర పాఠశాల.. ఈ నాలుగు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు మినిస్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక