యూఏఈ కేబినెట్ కీలక నిర్ణయం. పేదలకు హౌసింగ్ లోన్ మాఫీ
- November 30, 2021యూఏఈ: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆదాయం తక్కువ గా ఉన్న ప్రజలకు హౌసింగ్ లోన్ మాఫీ చేయాలని నిర్ణయించింది. ఆర్థిక అసమానతలను తగ్గించటం, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు ఈ డిసిషన్ తీసుకున్నట్లు ప్రకటించింది. దుబాయ్ లో జరుగుతున్న ఎక్స్ పో 2020 లో సమావేశమైన యూఏఈ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. దీంతో వేలాది కుటుంబాలకు మేలు జరగనుంది. యూఏఈ వైస్ ప్రెసిడెండ్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశమైంది. హౌసింగ్ లోన్ మాఫీతో పాటు కీలకమైన నేషనల్ మెడిసిన్ పాలసీకి కూడా ఆమోద ముద్ర వేసిది. ఈ నిర్ణయం కారణంగా దేశ ఫార్మాసిటికల్ రంగంలో అద్భుతమైన మార్పులు రానున్నాయి. ఫార్మా రంగంలో దేశీయ టాలెంట్ ను వాడుకోనున్నారు. అదే విధంగా ఖరీదైన మందులు పేదలకు కూడా అందుబాటులో ఉండేలా చేయనున్నారు. దీంతో పాటు పలు పొలిటికల్ డిసిషన్స్ ను కూడా సమావేశంలో తీసుకున్నారు. ఈ మీటింగ్ కు లెప్ట్ నెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్ యాన్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటిరీయర్ మినిస్టర్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహియాన్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు