కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో పబ్లిక్ ప్లేస్ లలో 80 శాతం అనుమతి
- November 30, 2021అబుధాబి: కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్లేస్ లలో ఆంక్షలను సడలించాలని నిర్ణయించింది. రెస్టారెంట్లు, పార్క్ లు, స్పోర్ట్స్ సెంటర్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఎంటర్ టైన్ మెంట్ ప్లేస్ లలో ఇక నుంచి 80 శాతం కెపాసిటీ కి అనుమతించనున్నారు. దీంతో మళ్లీ హోటల్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ వ్యాపారం పెరగనుంది. చాలా మంది వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ అనుమతితో అబుధాబి డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ (ADDED) ఈ డిసిషన్ తీసుకుంది. ఐతే హెల్త్ క్లబ్స్, జిమ్ లలో మాత్రం 50 శాతం కెపాసిటీతోనే నడపాలని సూచించింది. రెస్టారెంట్లు, కేఫ్ లలో ఒకే టేబుల్ వద్ద 10 మంది కన్నా ఎక్కువగా కుర్చోవటానికి వీల్లేదని ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకటించింది. ఇక పబ్లిక్ ప్లేస్ లు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ లో పనిచేసే వ్యక్తులందరికీ కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ కావాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పూర్తైన వారే పబ్లిక్ ప్లేస్ లలో రావాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం