జాతీయ జెండా చట్టానికి సవరణల్ని ఆమోదించిన షౌరా కౌన్సిల్
- February 02, 2022
రియాద్: సౌదీ అరేబియా షౌరా కౌన్సిల్, జాతీయ పతాకం, చిహ్నం అలాగే జాతీయ గీతానికి సంబంధించి చట్టానికి సవరణలు చేయడం జరిగింది. ఆకుపచ్చ జెండాపై కత్తి అలాగే ఇస్లామ్ సూక్తుల్ని మరింత స్పష్టంగా తెలిసేలా చూపించనున్నారు. జాతీయ జెండా, జాతీయ గీతం తాలూకు ఆవశ్యకతను మరింత బాగా తెలుసుకునేలా, నిర్లక్ష్యానికి వీలు లేకుండా పలు కీలక చర్యలు తీసుకున్నారు. షౌరా సభ్యుడు సాద్ అల్ ఒతైబి ఈ సవరణను ప్రతిపాదించారు. ఈ సవరణపై షౌరా కౌన్సిల్లో చర్చ, ఓటింగ్ జరిగాయి. సవరణల ద్వారా చట్టాల్ని ఉల్లంఘించేవారికి జరీమానాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. యాభయ్యేళ్ళుగా వున్న చట్టానికి తాజాగా సవరణ చేశారు. జాతీయ చిహ్నాన్ని వినియోగించడంపైనా స్పష్టమైన నిబంధనల్ని పేర్కొన్నారు. తగిన అనుమతులు లేకుండా చిహ్నాన్ని వినియోగించడానికి వీల్లేదు. ఉల్లంఘనలకు విధించే జరీమానాలపై స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కమర్షియల్ వినియోగానికి వీల్లేకుండా జాతీయ చిహ్నానికి ప్రత్యేకతల్ని అద్దారు ఈ సవరణల ద్వారా. ఆకుపచ్చని పతాకంపై తెల్లటి అక్షరాలతో అల్లాని మించిన దైవం లేదు.. అల్లా దూత మొహమ్మద్.. అని జాతీయ పతాకంపై పేర్కొంటారు. జాతీయ జెండా డిజైన్ మార్చి 15, 1973న ఖరారు చేయబడింది. కింగ్ ఫైజల్హయాంలో సౌదీ ఫ్లాగ్ చట్టం రూపొందింది. రెక్టాంగిల్ షేప్లో ఈ జెండా వుంటుంది. జాతీయ చిహ్నం 1950లో ఖరారు చేశారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









