ఏపీ కరోనా అప్డేట్
- February 20, 2022
అమరావతి: ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 335 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజు(425)తో పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు.
ఒక్కరోజు వ్యవధిలో 936మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 19వేల 241 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,29,77,640 కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,16,585. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 22,94,818. రాష్ట్రంలో 6వేల 754 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 713కి పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. రోజురోజుకి కేసులు తగ్గుతుండటం ఊరటనిచ్చే అంశం అని నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









