దేశంలో పలు ప్రాంతాల్లో టోల్ రోడ్లను ప్రవేశపెట్టనున్న ఒమన్
- February 21, 2022
మస్కట్: దేశంలోని పలు రోడ్లను వినియోగించేందుకు వాహనదారులు టోల్ చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ సెక్రెటరీ (ట్రాన్స్పోర్ట్) వెల్లడించడం జరిగింది. ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తెచ్చాక ఆయా రోడ్లపై టోల్ అమలు చేస్తారు. అల్ కామిల్ వా అల్ వాఫి, అల్ అష్కారాలను కలిపే రోడ్డు, విలాయత్ మక్షిన్ (దోఫార్), సౌత్ అల్ బతినా మరియు అల్ దఖ్లియాలను కలిపే రోడ్డు, బిద్బిద్ - నిజ్వా రోడ్డు ఇందులో వున్నాయి. జబాల్ అక్దర్కి కనెక్టివిటీ పెంచేందుకు రైల్వే లింక్ అలాగే సౌత్ అల్ బతినా నుంచి రోడ్డుని కూడా ఏర్పాటు చేయనున్నారు. భారీ వాహనాల కోసం ప్రత్యేకంగా రోడ్లను నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









