హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ భేటీ.. పలు అంశాలపై సమీక్ష
- February 23, 2022
ఖతార్: కార్మిక శాఖ మంత్రి డాక్టర్ అలీ బిన్ స్మైఖ్ అల్-మర్రీ అధ్యక్షతన నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ 2022లో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా బాధితులకు రక్షణ, మద్దతును పెంపొందించడంపై చర్చించింది. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కమిటీ పాత్రను ప్రోత్సహించడంపై కమిటీ దృష్టి సారించింది.దీని కోసం సంబంధిత రాష్ట్ర అధికారుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన అనేక ప్రతిపాదనలు, ప్రాజెక్టులను సమావేశం సమీక్షించింది. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో ఖతార్ ప్రయత్నాలను బలోపేతం చేయడం గురించి కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్, జాతీయ మానవ హక్కులతో పాటు కార్మిక మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







