హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ భేటీ.. పలు అంశాలపై సమీక్ష
- February 23, 2022
ఖతార్: కార్మిక శాఖ మంత్రి డాక్టర్ అలీ బిన్ స్మైఖ్ అల్-మర్రీ అధ్యక్షతన నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ 2022లో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా బాధితులకు రక్షణ, మద్దతును పెంపొందించడంపై చర్చించింది. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కమిటీ పాత్రను ప్రోత్సహించడంపై కమిటీ దృష్టి సారించింది.దీని కోసం సంబంధిత రాష్ట్ర అధికారుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన అనేక ప్రతిపాదనలు, ప్రాజెక్టులను సమావేశం సమీక్షించింది. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో ఖతార్ ప్రయత్నాలను బలోపేతం చేయడం గురించి కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్, జాతీయ మానవ హక్కులతో పాటు కార్మిక మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







