ముందస్తు పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు: ఎతిహాద్

- February 27, 2022 , by Maagulf
ముందస్తు పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు: ఎతిహాద్

అబుధాబి: ఫిబ్రవరి 26 నుండి అమల్లోకి వచ్చిన యూఏఈ కొత్త ట్రావెల్ నిబంధనల ప్రకారం.. పూర్తి వ్యాక్సిన్‌ డోసులు తీసుకున్న వారికి, ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లో అబుధాబికి ప్రయాణించే గెస్ట్ లకు ఇకపై ముందస్తు PCR టెస్ట్ అవసరం లేదు.ఈ మేరకు ఎతిహాద్ ఎయిర్ వేస్ సంస్థ వెల్లడించింది.అలాగే వ్యాక్సినేటెడ్ అయి అబుధాబి ద్వారా బయలుదేరే వారికి కూడా PCR పరీక్షలు అవసరం లేదు.అయితే వ్యాక్సిన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా QR కోడ్‌ని కలిగి ఉండాలి. ప్రయాణికులు అబుధాబి ఎయిర్ పోర్టుకి చేరుకున్న తర్వాత మాత్రం ఉచిత కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.వ్యాక్సిన్ వేయించుకోని వారు, అబుదాబికి లేదా అక్కడి నుండి ప్రయాణించే గెస్టులు మాత్రం తప్పనిసరిగా బయలుదేరిన 48 గంటలలోపు తీసుకున్న నెగిటివ్ PCR  టెస్ట్ రిపోర్టు సమర్పించాలి లేదా కోవిడ్-19 వచ్చిన 30 రోజులలోపు QR కోడ్‌తో రికవరీ సర్టిఫికేట్ ను అందజేయాలి.16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు విమానంలో ప్రయాణించడానికి వ్యాక్సిన్, పీసీఆర్ టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com