ఇరాక్లో అమెరికా రాయబార కార్యాలయం పై క్షిపణి దాడి
- March 13, 2022
ఇరాక్: యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇరాక్లో అమెరికా రాయబార కార్యాలయం టార్గెట్గా క్షిపణుల దాడి జరగడం కలకలం రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మిస్సైల్స్ను యూఎస్ కాన్సులేట్ వైపుగా ప్రయోగించారు. ఇరాన్ వైపు నుంచే క్షిపణి దాడి జరిగినట్టు అమెరికా అనుమానిస్తోంది.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. ఇరాక్ ఉత్తర ప్రాంతం ఇర్బిల్లో అమెరికా కొత్తగా రాయబార కార్యాలయాన్ని నిర్మించింది. దాన్ని టార్గెట్ చేసుకునే మిసైల్ దాడులు జరిగాయి. అయితే ఈ భవనం నుంచి అమెరికా ఇంకా ఎలాంటి కార్యకలాపాలను ప్రారంభించలేదు. దీంతో ప్రాణనష్టం తప్పింది.
ఇటీవల జరిగిన సిరియా డమాస్కస్లో ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్లో ఇద్దరు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అప్పుడే ప్రకటించింది. అందులో భాగంగానే క్షిపణులతో విరుచుకుపడినట్టు అమెరికా అనుమానిస్తోంది.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







