రమదాన్.. మాల్స్ లో అధికారుల తనిఖీలు
- March 25, 2022
బహ్రెయిన్: పరిశ్రమ, వాణిజ్యం, పర్యాటక మంత్రిత్వ శాఖ బహ్రెయిన్లోని అన్ని గవర్నరేట్లలోని వివిధ ఫుడ్ అవుట్లెట్లు, స్టోర్లను తనిఖీ చేసింది. రమదాన్ నెల ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పర్యవేక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. మనామా మార్కెట్లో మూలికలు, సుగంధ ద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన దుకాణాలను తనిఖీ విభాగాలు తనిఖీలు చేసినట్లు కంట్రోల్ అండ్ రిసోర్సెస్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ మహ్మద్ అలీ అల్ అష్రఫ్ తెలిపారు. ఉత్పత్తుల నాణ్య, లభ్యత, వాణిజ్య కార్యకలాపాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల రమదాన్ నెలంతా కొనసాగుతాయన్నారు. పవిత్ర మాసంలో ప్రసిద్ధి చెందిన దుకాణాల్లోనూ తనిఖీలు చేపడతామన్నారు. దుకాణాలు ప్రమోషన్ల నియమాలు, ఉత్పత్తుల నాణ్యతకు కట్టుబడి ఉండాలని, లేదంటే నిబంధనల ప్రకారం ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







