రమదాన్.. మాల్స్ లో అధికారుల తనిఖీలు
- March 25, 2022
బహ్రెయిన్: పరిశ్రమ, వాణిజ్యం, పర్యాటక మంత్రిత్వ శాఖ బహ్రెయిన్లోని అన్ని గవర్నరేట్లలోని వివిధ ఫుడ్ అవుట్లెట్లు, స్టోర్లను తనిఖీ చేసింది. రమదాన్ నెల ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పర్యవేక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. మనామా మార్కెట్లో మూలికలు, సుగంధ ద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన దుకాణాలను తనిఖీ విభాగాలు తనిఖీలు చేసినట్లు కంట్రోల్ అండ్ రిసోర్సెస్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ మహ్మద్ అలీ అల్ అష్రఫ్ తెలిపారు. ఉత్పత్తుల నాణ్య, లభ్యత, వాణిజ్య కార్యకలాపాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల రమదాన్ నెలంతా కొనసాగుతాయన్నారు. పవిత్ర మాసంలో ప్రసిద్ధి చెందిన దుకాణాల్లోనూ తనిఖీలు చేపడతామన్నారు. దుకాణాలు ప్రమోషన్ల నియమాలు, ఉత్పత్తుల నాణ్యతకు కట్టుబడి ఉండాలని, లేదంటే నిబంధనల ప్రకారం ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి









