రమదాన్.. మాల్స్ లో అధికారుల తనిఖీలు
- March 25, 2022
బహ్రెయిన్: పరిశ్రమ, వాణిజ్యం, పర్యాటక మంత్రిత్వ శాఖ బహ్రెయిన్లోని అన్ని గవర్నరేట్లలోని వివిధ ఫుడ్ అవుట్లెట్లు, స్టోర్లను తనిఖీ చేసింది. రమదాన్ నెల ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పర్యవేక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. మనామా మార్కెట్లో మూలికలు, సుగంధ ద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన దుకాణాలను తనిఖీ విభాగాలు తనిఖీలు చేసినట్లు కంట్రోల్ అండ్ రిసోర్సెస్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ మహ్మద్ అలీ అల్ అష్రఫ్ తెలిపారు. ఉత్పత్తుల నాణ్య, లభ్యత, వాణిజ్య కార్యకలాపాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల రమదాన్ నెలంతా కొనసాగుతాయన్నారు. పవిత్ర మాసంలో ప్రసిద్ధి చెందిన దుకాణాల్లోనూ తనిఖీలు చేపడతామన్నారు. దుకాణాలు ప్రమోషన్ల నియమాలు, ఉత్పత్తుల నాణ్యతకు కట్టుబడి ఉండాలని, లేదంటే నిబంధనల ప్రకారం ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









