ఉద్యోగులకి 100 కార్లు గిఫ్ట్ ఇచ్చిన ఓ ఐటీ సంస్థ
- April 12, 2022
చెన్నై:తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఓ ఐటీ సంస్థ తమ ఉద్యోగులకు 100 కార్లను గిఫ్ట్గా ఇచ్చింది. కంపెనీ ప్రగతిలో సహకరించిన ఉద్యోగులకు.. అసాధారణ మద్దతు ఇచ్చినవారికి కార్లను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.నగరానికి చెందిన ఐడియాస్2ఐటీ అనే కంపెనీ వంద ఉద్యోగులకు మారుతీ సుజుకీ కార్లను గిఫ్ట్గా ఇచ్చింది.
పదేళ్ల నుంచి కంపెనీ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన వంద మంది ఉద్యోగులకు 100 కార్లను ఇస్తున్నట్లు Ideas2IT కంపెనీ మార్కెటింగ్ అధిపతి హరి సుబ్రమణియం తెలిపారు. తమ కంపెనీలో సుమారు 500 ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు.తాము పొందిన సంపదను తిరిగి ఉద్యోగులకు ఇవ్వడం తమ ఉద్దేశమని తెలిపారు.కంపెనీ ఉద్యోగులకు కార్లు ఇవ్వడం లేదని, ఉద్యోగులే తమ సామర్థ్యాన్ని ధారిపోసి ఆ కార్లను స్వొంతం చేసుకున్నారని చైర్మెన్ మురళీ వివేకానందన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









