తిరుమల: ఎల్ఈడీ స్క్రీన్లపై తెలుగు సినిమా పాటల ప్రసారం
- April 23, 2022
తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ మధ్య వరుస వివాదాస్పద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న సర్వదర్శనం టికెట్స్ విషయంలో జరిగిన తప్పిదం విమర్శల పాలు చేయగా..తాజాగా ఇప్పుడు ఎల్ఈడీ స్క్రీన్లపై తెలుగు సినిమా పాటల ప్రసారం కావడం భక్తులను షాక్ కు గురిచేసింది.
తిరుమలలోని ఓ వ్యాపార సముదాయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ పై సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. నిత్యం గోవింద నామస్మరణ, అన్నమయ్య తదితరుల భక్తిగీతాలతో మార్మోగే తిరుమల కొండపై సినిమా పాటలు ప్రసారం కావడంతో భక్తులు విస్తుపోయారు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6.15 గంటల వరకు సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. సినిమా పాటల దృశ్యాల వెనుక గోవింద నామాలు ప్రసారం కావడంతో భక్తులు విస్మయానికి గురయ్యారు. మరి ఈ ఘటన పట్ల టీటీడీ ఏ సమాధానం చెపుతుందో చూడాలి.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







