ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- May 01, 2022
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం ఎమిరేట్స్, అరబ్, ఇస్లామిక్ దేశాల ప్రజలు ఒకరికొకరు దగ్గరవుతున్నారని తన సందేశంలో పేర్కొన్నారు. మన హృదయాలు మరింత ప్రేమగా, సహనంతో, శాంతియుతంగా ఉంటాయన్నారు. అలాగే యూఏఈ, అరబ్, అన్ని ఇస్లామిక్ దేశాల నాయకులకు క్రౌన్ ప్రిన్స్ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఎమిరేట్స్, అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకత్వం, ప్రజలను అభినందిస్తున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి షవ్వాల్ చంద్రుడు కనిపించకపోవడంతో యూఏఈలో మే 2న ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







