ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- May 01, 2022
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం ఎమిరేట్స్, అరబ్, ఇస్లామిక్ దేశాల ప్రజలు ఒకరికొకరు దగ్గరవుతున్నారని తన సందేశంలో పేర్కొన్నారు. మన హృదయాలు మరింత ప్రేమగా, సహనంతో, శాంతియుతంగా ఉంటాయన్నారు. అలాగే యూఏఈ, అరబ్, అన్ని ఇస్లామిక్ దేశాల నాయకులకు క్రౌన్ ప్రిన్స్ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఎమిరేట్స్, అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకత్వం, ప్రజలను అభినందిస్తున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి షవ్వాల్ చంద్రుడు కనిపించకపోవడంతో యూఏఈలో మే 2న ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







