ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- May 01, 2022యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం ఎమిరేట్స్, అరబ్, ఇస్లామిక్ దేశాల ప్రజలు ఒకరికొకరు దగ్గరవుతున్నారని తన సందేశంలో పేర్కొన్నారు. మన హృదయాలు మరింత ప్రేమగా, సహనంతో, శాంతియుతంగా ఉంటాయన్నారు. అలాగే యూఏఈ, అరబ్, అన్ని ఇస్లామిక్ దేశాల నాయకులకు క్రౌన్ ప్రిన్స్ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఎమిరేట్స్, అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకత్వం, ప్రజలను అభినందిస్తున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి షవ్వాల్ చంద్రుడు కనిపించకపోవడంతో యూఏఈలో మే 2న ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు