ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్

- May 01, 2022 , by Maagulf
ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్

యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం ఎమిరేట్స్, అరబ్, ఇస్లామిక్ దేశాల ప్రజలు ఒకరికొకరు దగ్గరవుతున్నారని తన సందేశంలో పేర్కొన్నారు. మన హృదయాలు మరింత ప్రేమగా, సహనంతో, శాంతియుతంగా ఉంటాయన్నారు. అలాగే యూఏఈ,  అరబ్, అన్ని ఇస్లామిక్ దేశాల నాయకులకు క్రౌన్ ప్రిన్స్ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఎమిరేట్స్, అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకత్వం, ప్రజలను అభినందిస్తున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి షవ్వాల్ చంద్రుడు కనిపించకపోవడంతో యూఏఈలో మే 2న ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com