నిరుద్యోగులకు ఇన్స్యూరెన్స్ పథకం: ఎమిరాతీలకు, వలసదారులకు వర్తిస్తుందా?
- May 12, 2022
యూఏఈ: ఉద్యోగాలు కోల్పోయే సమస్య నుంచి నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా కొత్త నిరుద్యోగ ఇన్స్యూరెన్స్ స్కీమ్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరైటైజేషన్ అబ్దుల్ రహ్మాన్ అల్ అవార్ మాట్లాడుతూ, ప్రత్యేక కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయేవారికి కొంత కాలం పాటు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2023 నుంచి ఈ తప్పనిసరి స్కీమ్ అందుబాటులోకి వస్తుంది. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. లేబర్ మార్కెట్ స్థిరత్వం కోసం ఈ ఆలోచన చేశారు.ఇన్వెస్టర్లు, డొమెస్టిక్ వర్కర్లు, తాత్కాలిక ఒప్పందాలపై పని చేసేవారు, 18 ఏళ్ళ లోపు జువైనల్స్ అలాగే రిటైర్ అయినవారికి ఈ స్కీమ్ వర్తించదు. ఇన్స్యూరెన్స్ కంపెనీల ద్వారా వివిధ ప్యాకేజీలకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా ఉద్యోగం పోతే, వారికి ఇన్స్యూరెన్స్ ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. తమ బేసిక్ సేలరీలో 60 శాతం ఇన్స్యూరెన్స్ ద్వారా వస్తుంది. అత్యధికంగా 20,000 దిర్హాముల వరకు పరిమిత కాలానికి ఈ సాయం అందుతుంది. తప్పనిసరి ఇన్స్యూరెన్స్ 40 దిర్హాముల నుంచి 100 దిర్హాముల వరకు వుంటుంది ఏడాదికి. అత్యధిక ఇన్స్యూరెన్స్ ప్యాకేజీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరిమిత కాలం తర్వాత కూడా ఉద్యోగం దొరక్కపోతే, ఇన్స్యూరెన్స్ పేమెంట్స్ ఆగిపోతాయి. అయితే, ఆ పరిమిత సమయం ఎంత అన్నది ఇంకా వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







