డిజిటల్ సర్వీసులను ప్రారంభించిన ఖతార్ కార్మికశాఖ
- June 04, 2022
ఖతార్: తాత్కాలిక ఉద్యోగ వీసాల అభ్యర్థనల కోసం కొత్త డిజిటల్, పేపర్-లెస్ సేవలను ప్రారంభించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) వెల్లడించింది. ఇది ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిష్కారాలను అందిస్తుందని పేర్కొంది. దీనితో కార్యాచరణ నైపుణ్యాన్ని సాధించడానికి, వినియోగదారుల సంతృప్తిని పెంచడానికి తన సేవలను ఆటోమేట్ చేసే ప్రయత్నాలలో భాగమని తెలిపింది. కొత్తగా లాంచ్ చేసిన వాటిల్లో నాలుగు ఆటోమేటెడ్ సర్వీసులు ఉన్నాయని, ఇవి ఇంతకు ముందు మాన్యువల్గా మాత్రమే ప్రాసెస్ చేసినట్లు తెలిపింది. తాత్కాలిక ఉద్యోగ వీసాల కోసం అభ్యర్థనలు, ప్రభుత్వ,సెమీ-గవర్నమెంటల్ సంస్థలకు లేబర్ రిక్రూట్మెంట్ను సర్వీస్, క్యూఎఫ్సీ (QFC) కంపెనీల కోసం లేబర్ రిక్రూట్మెంట్ రిక్వెస్ట్ సర్వీసులు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీల కోసం రిక్రూట్మెంట్ అభ్యర్థనలు ఆటోమేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే స్వయంచాలకంగా ఆమోదించబడతాయి. మునుపటి ఆరు-దశల ఆమోదం ప్రక్రియ ఇప్పుడు ఒకే దశలో పూర్తవుతుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దాని వెబ్సైట్ https://www.mol.gov.qa/ద్వారా దాదాపు 47 ఇ-సేవలను అందిస్తోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







