ఖతార్ లో 29 కుక్కలను కాల్చి చంపిన దుండగులు
- July 23, 2022
ఖతార్: సాయుధులైన కొందరు వ్యక్తులు స్థానిక కర్మాగారంపై దాడి చేసి 29 కుక్కలను కాల్చి చంపి, ఇతరులను గాయపరిచినట్లు అల్ మయాస్సా బింట్ హమద్ అల్ థానీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ సంఘటన గురించి వివరించారు. ఇది "ఆమోదయోగ్యం కాదు" అని ఘటనను తీవ్రంగా ఖండించారు. స్థానిక కర్మాగారంలోని కుక్కల్లో ఒకటి.. కుక్కులను చంపిన వారి పిల్లల్లో ఒకరిని కరిచినట్లు వారు పేర్కొన్నారని భద్రతా సిబ్బంది చెప్పారని పోస్టులో వివరించారు. అయితే, అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. అల్ థానీ కథనం ప్రకారం.. సాయుధులు భవనంలోకి చొరబడటానికి ముందు భద్రతా సిబ్బందిని బెదిరించారు. "ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకున్నందున భద్రతా సిబ్బంది భయపడ్డారు. న్యూటెర్డ్ కుక్కల సమూహాన్ని చంపకుండా సాయుధులను ఆపడానికి భద్రతా బృందం ప్రయత్నించి విఫలం అయ్యారు.’’ స్థానిక PAWS రెస్క్యూ ఖతార్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించింది.
తాజా వార్తలు
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!









