ఖతార్ లో 29 కుక్కలను కాల్చి చంపిన దుండగులు
- July 23, 2022
ఖతార్: సాయుధులైన కొందరు వ్యక్తులు స్థానిక కర్మాగారంపై దాడి చేసి 29 కుక్కలను కాల్చి చంపి, ఇతరులను గాయపరిచినట్లు అల్ మయాస్సా బింట్ హమద్ అల్ థానీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ సంఘటన గురించి వివరించారు. ఇది "ఆమోదయోగ్యం కాదు" అని ఘటనను తీవ్రంగా ఖండించారు. స్థానిక కర్మాగారంలోని కుక్కల్లో ఒకటి.. కుక్కులను చంపిన వారి పిల్లల్లో ఒకరిని కరిచినట్లు వారు పేర్కొన్నారని భద్రతా సిబ్బంది చెప్పారని పోస్టులో వివరించారు. అయితే, అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. అల్ థానీ కథనం ప్రకారం.. సాయుధులు భవనంలోకి చొరబడటానికి ముందు భద్రతా సిబ్బందిని బెదిరించారు. "ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకున్నందున భద్రతా సిబ్బంది భయపడ్డారు. న్యూటెర్డ్ కుక్కల సమూహాన్ని చంపకుండా సాయుధులను ఆపడానికి భద్రతా బృందం ప్రయత్నించి విఫలం అయ్యారు.’’ స్థానిక PAWS రెస్క్యూ ఖతార్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







