హైదరాబాద్ లో కుండపోత వర్షం
- July 29, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో మరోసారి కుండపోత వర్షం కురుస్తుంది. మధ్నాహ్నాం వరకు విపరీతమైన ఎండ కొట్టగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చినుకులతో మొదలై భారీ వర్షంగా మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీనది వరద ఉద్ధృతి తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న నగర వాసులు.. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు.
నేరేడ్ మెట్ లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క గంటలోనే దాదాపు 129 కంప్లైంట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బేగంపేట్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ , సికింద్రాబాద్, సనత్ నగర్ ,అమీర్పేట్, కొత్తపేట్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చంపాపేట్, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదీగూడ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగం బజార్ తరిత ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది.
రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.యూసఫ్గూడలో ఓ వ్యక్తి వాషింగ్ మిషన్ నీటిలో కొట్టుకుపోయింది. దానిని ఆపడానికి ఆ వ్యక్తి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ నీటి ఉద్ధృతికి అది కొట్టుకుపోయింది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది. రాష్ట్రంపై ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









