అంత జాగ్రత్త తీసుకున్నా.. ‘గాడ్ ఫాదర్’కి అపశృతి తప్పలేదుగా.!
- October 01, 2022
హైదరాబాద్: సినిమా ఫంక్షన్లకు వచ్చే అభిమానులను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అందుకే తమ అభిమానులకు ముందుగానే హీరోలు హెచ్చరిస్తుంటారు తమ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని తమపై అభిమానాన్ని చూపించాలని.
ఎంత చెప్పినా, అభిమానుల్లో ఎంతో కొంత నిర్లక్ష్యం. పలు మార్లు చూస్తూనే వున్నాం. ఇటీవల జరిగిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఫంక్షన్లోనూ చిరంజీవి ఆ హెచ్చరిక చేసినప్పటికీ, అపశృతి జరిగింది. అనంతపురంలో జరిగిన ‘గాడ్ ఫాదర్’ ఈవెంట్కి వేలాది మంది అభిమానులు తరలి వచ్చిన సంగతి తెలిసిందే.
భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు చిరంజీవిని చూసేందుకు ఈ వేడుకకు పోటెత్తారు. చిరంజీవి సైతం అభిమానుల ఉత్సాహాన్ని చూసి, జోరు వానలోనూ ఉత్సాహంగా, ఉద్వేగమైన తన స్పీచ్ ఇచ్చి కష్టపడి అక్కడికి వచ్చిన అభిమానుల్ని సంతృప్తి పరిచారు.
అయితే, ఈ ఫంక్షన్కి వస్తూ దారిలోనే 22 ఏళ్ల ఓ కుర్రోడు యాక్సిడెంట్కి గురయ్యాడు. మరో పది, పదిహేను నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకోవల్సిన ఈ కుర్రాడు మృత్యువు ఒడికి చేరుకున్నాడు. అనంతపురం గుత్తి వద్ద జరిగిన యాక్సిడెంట్లో రాజశేఖర్ అనే కుర్రాడో మృతి చెందాడు.
గతంలో పలు మార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి రక్తదానం చేశాడు రాజశేఖర్. అలాగే చిరంజీవి పిలుపు మేరకు రాజశేఖర్ కుటుంబ సభ్యులు అతని కళ్లను కూడా దానం చేశారంటే, చిరంజీవిపై ఆ కుర్రాడికి వున్న అభిమానం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ కుర్రాడి కుటుంబ సభ్యలుకు చిరంజీవి కుటుంబం తరపున ఏదైనా సాయం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అఫ్కోర్స్.! చిరంజీవి అలాంటి విషయాల్లో ముందే వుంటాడనుకోండి.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









