మహిళపై 50,000 దిర్హామ్ల దావా.. వ్యక్తి పిటిషన్ కొట్టేసిన కోర్టు
- October 06, 2022
యూఏఈ: చేతబడి చేస్తున్నాడని ఆరోపించి.. తన ప్రతిష్టను దెబ్బతీసిన మహిళపై వ్యక్తి వేసిన 50,000 దిర్హామ్ల దావాను కోర్టు కొట్టేసింది. సదరు వ్యక్తి ప్రతిష్టను మహిళ దెబ్బతీసిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నష్టపరిహార వ్యాజ్యాన్ని అబుదాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు తిరస్కరించింది. అతను చేతబడి చేస్తున్నాడని అనుమానంతో ఫిర్యాదు చేసినప్పుడు, మహిళ తనకున్న న్యాయపరమైన మార్గాలను ఉపయోగించిందని కోర్టు అభిప్రాయపడ్డది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తాను చేతబడి చేశానని మహిళ తనపై క్రిమినల్ ఫిర్యాదు చేసిందని, అయితే సాక్ష్యాధారాలు లేకపోవడంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసును కోర్టుకు తరలించకముందే తిరస్కరించిందని సదరు వ్యక్తి తెలిపాడు. ఈ ఆరోపణలు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పని చేసే ప్రాంతంలో తన ప్రతిష్టను దెబ్బతీసిందని ఆ వ్యక్తి తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







