వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగంలో నియామకాలు
- June 16, 2015
వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగంలో పలు నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గల్ఫ్, యు ఏ ఈ, కువైట్ ఎన్నారై కమిటీలలో ఈ నియామకాలు జరిగాయి. గల్ఫ్ కౌన్సిల్ లీడర్షిప్ టీం కన్వీనర్ గా బి.హెచ్.ఇలియాస్ (కువైట్)ను, కువైట్ విభాగం ఎన్నారై కమిటీ కన్వీనర్ గా ఎం.బాలిరెడ్డి నియమితులయ్యారు. ఆయా దేశాల ప్రతినిధులుగా షేక్ ఫయాజ్ (కువైట్), మంత్రాల న్యామతుల్లా (సౌదీ అరేబియా), నానార్ వలీ సయ్యద్, జి.విజయ భాస్కర్ రెడ్డి (యుఏయీ), ఆనంద్ ఈద, మందల వర్జిల్ బాబు (ఖతార్), కుంతం దేవేందర్ (బహ్రెయిన్), షేక్ అల్లావుద్దీన్ (ఎమెన్) నియుక్తులుయ్యారు. వీరు కాకుండా గల్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా జీఎస్ఎస్ యెన్ రెడ్డి నియమితులయ్యారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







