భారత్లో తయారైన దగ్గు సిరప్లపై హెచ్చరికలు జారీ చేసిన అబుధాబి
- October 15, 2022
అబుధాబి: ఇటీవల గాంబియాలో చిన్నారుల మరణానికి కారణమైన నాలుగు దగ్గు, జలుబు మందులపై(ప్రోమెథాజైన్ నోటి ద్రావణం BP, కోఫెక్స్మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ, మాగ్రిప్ ఎన్ కోల్డ్) ఎమిరేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (DoH) హెచ్చరికలు జారీ చేసింది. భారత్ లో తయారైన ఈ దగ్గు, జలుబు మందులను అబుధాబిలో ఎక్కడా విక్రయించడం లేదని డీఓహెచ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ మందులను కొని వినియోగించే వారు ఏమైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని డిపార్ట్మెంట్ కోరింది. భారత్కు చెందిన మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు ఔషధాల కారణంగా ఇటీవల ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దగ్గు మందులు, జలుబు మందుల వినియోగంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మందుల ఉత్పత్తిపై నిషేధం విధించిన భారత్.. ఆ కంపెనీ ఉత్పత్తులపై దర్యాప్తు ప్రారంభించింది.
తాజా వార్తలు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!