ఖతార్ హయ్యా కార్డులు కలిగిన ముస్లింలను ఉమ్రాకు అనుమతించిన సౌదీ
- October 15, 2022ఖతార్: ఫిఫా ప్రపంచ కప్ 2022 కోసం వచ్చే ఫుట్ బాల్ అభిమానులు మల్టీ-ఎంట్రీ వీసాతో ఉమ్రా చేయడానికి సౌదీ అరేబియా అనుమతించింది. ఖతార్ హయ్యా కార్డులు కలిగిన ముస్లింలు ఉమ్రా చేయవచ్చని, నవంబర్ 11 నుండి డిసెంబర్ 18, 2022 వరకు ఉచిత సౌదీ వీసాతో మదీనాను సందర్శించవచ్చని సౌదీ అరేబియా ప్రకటించింది. అలాగే ముస్లిం హయా కార్డ్ హోల్డర్లు రెండు నెలల వరకు దేశంలో ఉండవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ వీసా అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఖలీద్ అల్-షమ్మరి తెలిపారు. వీసా ఉచితమని, కానీ వైద్య బీమా తప్పనిసరిగా వీసా ప్లాట్ఫారమ్ నుండి పొందాలని అల్-షమ్మరి సూచించారు. కార్డ్ హోల్డర్లకు మల్టీ-ఎంట్రీ వీసా అందిస్తున్నామని, దాని చెల్లుబాటు వ్యవధిలో వారు ఎప్పుడైనా సౌదీ అరేబియాలోకి ప్రవేశించవచ్చని, నిష్క్రమించవచ్చని అల్-షమ్మరి వెల్లడించారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు