అక్టోబర్ 30 నుంచి రోజు బెంగళూరు-దుబాయ్ మధ్య ఎమిరేట్స్ ఫ్లైట్ సేవలు
- October 15, 2022
యూఏఈ : యూఏఈ విమానయ సంస్థ ఎమిరేట్స్...ఇండియా నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా బెంగళూరు టూ దుబాయ్ కి స్పెషల్ ఫ్లైట్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 30 నుంచి ప్రతి రోజు బెంగళూరు నుంచి దుబాయ్ కి ఎమిరేట్స్ A380 సర్వీసు ఫ్లైట్ నడపనుంది. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ గా ఫస్ట్ ఫ్లైట్ ను శనివారం ప్రారంభించింది. అక్టోబర్ 30 నుంచి దుబాయ్ -బెంగళూరు మధ్య ఎమిరేట్స్ A380 ఫ్లైట్ నంబర్ EK568, EK569గా నడుస్తాయి. దుబాయ్ నుంచి రాత్రి 9.25 గంటలకు ఎయిర్లైన్ హబ్ నుండి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 4.30 గంటలకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి, ఉదయం 7.10 గంటలకు దుబాయ్ చేరుకుంటుంది. సౌత్ ఇండియాలో ఫ్లైట్ సర్వీసు ప్రారంభించటం సంతోషంగా ఉందని ఎమిరేట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అద్నాన్ కాజిమ్ అన్నారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!









