అక్టోబర్ 30 నుంచి రోజు బెంగళూరు-దుబాయ్ మధ్య ఎమిరేట్స్ ఫ్లైట్ సేవలు

- October 15, 2022 , by Maagulf
అక్టోబర్ 30 నుంచి రోజు బెంగళూరు-దుబాయ్ మధ్య ఎమిరేట్స్ ఫ్లైట్ సేవలు

యూఏఈ : యూఏఈ విమానయ సంస్థ ఎమిరేట్స్...ఇండియా నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా బెంగళూరు టూ దుబాయ్ కి స్పెషల్ ఫ్లైట్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 30 నుంచి ప్రతి రోజు బెంగళూరు నుంచి దుబాయ్ కి ఎమిరేట్స్ A380 సర్వీసు ఫ్లైట్ నడపనుంది. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ గా ఫస్ట్ ఫ్లైట్ ను శనివారం ప్రారంభించింది. అక్టోబర్ 30 నుంచి దుబాయ్ -బెంగళూరు మధ్య ఎమిరేట్స్ A380 ఫ్లైట్ నంబర్ EK568, EK569గా నడుస్తాయి. దుబాయ్ నుంచి రాత్రి 9.25 గంటలకు ఎయిర్‌లైన్ హబ్ నుండి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 4.30 గంటలకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి, ఉదయం 7.10 గంటలకు దుబాయ్ చేరుకుంటుంది. సౌత్ ఇండియాలో ఫ్లైట్ సర్వీసు ప్రారంభించటం సంతోషంగా ఉందని ఎమిరేట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అద్నాన్ కాజిమ్ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com