అక్టోబర్ 30 నుంచి రోజు బెంగళూరు-దుబాయ్ మధ్య ఎమిరేట్స్ ఫ్లైట్ సేవలు
- October 15, 2022
యూఏఈ : యూఏఈ విమానయ సంస్థ ఎమిరేట్స్...ఇండియా నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా బెంగళూరు టూ దుబాయ్ కి స్పెషల్ ఫ్లైట్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 30 నుంచి ప్రతి రోజు బెంగళూరు నుంచి దుబాయ్ కి ఎమిరేట్స్ A380 సర్వీసు ఫ్లైట్ నడపనుంది. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ గా ఫస్ట్ ఫ్లైట్ ను శనివారం ప్రారంభించింది. అక్టోబర్ 30 నుంచి దుబాయ్ -బెంగళూరు మధ్య ఎమిరేట్స్ A380 ఫ్లైట్ నంబర్ EK568, EK569గా నడుస్తాయి. దుబాయ్ నుంచి రాత్రి 9.25 గంటలకు ఎయిర్లైన్ హబ్ నుండి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 4.30 గంటలకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి, ఉదయం 7.10 గంటలకు దుబాయ్ చేరుకుంటుంది. సౌత్ ఇండియాలో ఫ్లైట్ సర్వీసు ప్రారంభించటం సంతోషంగా ఉందని ఎమిరేట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అద్నాన్ కాజిమ్ అన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







