కరెంట్ బిల్లులపై అదనపు రుసుం వసూలు చేయట్లేదు-మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ

- October 15, 2022 , by Maagulf
కరెంట్ బిల్లులపై అదనపు రుసుం వసూలు చేయట్లేదు-మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ

మస్కట్ : కరెంట్ బిల్లులకు అదనపు రుసుం వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది. కరెంట్ బిల్లులకు సంబంధించి ఎలాంటి అదనపు రుసుంను వసూలు చేయటం లేదని స్పష్టం చేసింది. గతంలో అమలులో ఉన్న విధంగానే కరెంట్ బిల్లుల వసూళ్లు జరుగుతున్నాయని మస్కట్ మున్సిపాలిటీ ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ఎలాంటి అదనపు రుసుం ఛార్జ్ చేయటం లేదని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com