ఆ 18 మంది పిల్లల మరణానికి హౌతీలే బాధ్యులు
- October 16, 2022
యెమెన్లోని సనాలో గడువు ముగిసిన కీమోథెరపీ ఇంజెక్షన్తో 18 మందికి పైగా చిన్నారుల మరణానికి ఇరాన్ మద్దతుగల హౌతీ మిలీషియా కారణమని యెమెన్ సమాచార మంత్రి మొఅమర్ అల్-ఎర్యానీ ఆరోపించారు. మిలీషియా ఆధీనంలో ఉన్న నగరంలోని ఒక ఆసుపత్రిలో లుకేమియాకు చికిత్స పొందుతున్న పిల్లలకు – కలుషితమైన, నెలల తరబడి హౌతీల గిడ్డంగులలో నిల్వ చేయబడిన కీమోథెరపీ ఇంజెక్షన్లను వినియోగించినట్లు మంత్రి వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర సంస్థలు యెమెన్కు విరాళంగా అందించిన కీమోథెరపీ ఇంజెక్షన్లను హౌతీలు ఆసుపత్రులకు పంపిణీ చేశారని అల్-ఎర్యానీ వెల్లడించారు. అయితే, హౌతీలు వాటిని ఆసుపత్రులకు పంపిణీ చేయడానికి ముందు చాలా కాలం పాటు నిల్వ చేశారన్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అల్-ఎర్యానీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థలు ఉచితంగా అందించే మందులను హౌతీ మిలీషియా అడ్డుకోని వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుందని ఆరోపించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి