టబుక్ రీజియన్లో 3.38-తీవ్రతతో భూకంపం
- October 17, 2022
జెడ్డా: టబుక్ ప్రాంతానికి వాయువ్యంగా ఆదివారం సాయంత్రం 3.38 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS)కి అనుబంధంగా ఉన్న జియోలాజికల్ హజార్డ్స్ సెంటర్లోని జాతీయ నెట్వర్క్ స్టేషన్లు తెలిపాయి. ప్రకంపనలు టబుక్ ప్రాంతానికి వాయువ్యంగా 48 కి.మీ., 19.37 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉన్నాయని ఎస్జీఎస్ ప్రతినిధి తారిఖ్ అబా అల్-ఖైల్ వెల్లడించారు. గల్ఫ్ ఆఫ్ అకాబా, ఉత్తర ఎర్ర సముద్రం మధ్య ఉన్న టెక్టోనిక్ ఒత్తిళ్ల కారణంగా భూకంపం సంభవించిందన్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉందని, అంత ప్రమాదకరమైనది కాదని.. పౌరులు, నివాసితులు భయపడాల్సిన అవసరం లేదని తారిఖ్ అబా అల్-ఖైల్ వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









