అవినీతి ఆరోపణలు.. కేఏయూ అధ్యక్షుడిని తొలగించిన రాజు సల్మాన్

- October 28, 2022 , by Maagulf
అవినీతి ఆరోపణలు.. కేఏయూ అధ్యక్షుడిని తొలగించిన రాజు సల్మాన్

రియాద్ : రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ గురువారం కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్శిటీ (KAU) అధ్యక్షుడు డాక్టర్ అబ్దుర్‌రహ్మాన్ అల్-యౌబీని తొలగించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాజు వేటు వేశారు. దీంతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. అల్-యౌబీకి వ్యతిరేకంగా ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయల్ డిక్రీ పేర్కొంది. అల్-యౌబీ తన అధికారిక అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని  యూనివర్సిటీ నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్, ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడ్డాడని రాయల్ ఆర్డర్ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com