అవినీతి ఆరోపణలు.. కేఏయూ అధ్యక్షుడిని తొలగించిన రాజు సల్మాన్
- October 28, 2022
రియాద్ : రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ గురువారం కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్శిటీ (KAU) అధ్యక్షుడు డాక్టర్ అబ్దుర్రహ్మాన్ అల్-యౌబీని తొలగించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాజు వేటు వేశారు. దీంతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. అల్-యౌబీకి వ్యతిరేకంగా ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయల్ డిక్రీ పేర్కొంది. అల్-యౌబీ తన అధికారిక అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని యూనివర్సిటీ నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్, ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడ్డాడని రాయల్ ఆర్డర్ పేర్కొంది.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









