సౌదీలో 43 శాతం పెరిగిన ఎయిర్ ట్రాఫిక్
- November 01, 2022
రియాద్: 2021లో ఎయిర్ ట్రాఫిక్ 43% పెరుగుదలను నమోదు చేసిందని, ఓడరేవులలో ఇది 7 శాతంగా ఉందని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ప్రకటించింది. 2021లో సుమారు 497 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఎయిర్ పోర్టులో కార్యాకలాపాలు నిర్వహించాయి. వీటి ద్వారా సుమారు 49 మిలియన్ల మంది ప్రయాణికులు(30% పెరుగుదల) ప్రయాణించారు. ఇందులో విదేశీ విమానాల సంఖ్య 20% పెరుగుదల(126,000 ప్రయాణికులు) ఉండగా.. దేశీయ విమానాలు 53% (371,000) పెరుగుదల నమోదైందని అథారిటీ పేర్కొంది. రియాద్లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 33% విమానాలతో మొదటి స్థానంలో ఉందని, జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్పోర్ట్ 26%తో రెండు, దమ్మామ్లోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 13%తో మూడవ స్థానంలో ఉన్నాయి. ప్రయాణీకుల సంఖ్య పరంగా కింగ్ ఖలీద్ విమానాశ్రయం అత్యధికంగా 35%, కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయం 29%, ఆపై కింగ్ ఫహద్ విమానాశ్రయం 12% వరుసగా స్థానం పొందాయి.
13.2 వేల నౌకలు
ఓడరేవులలో నౌకల కదలిక 7% పెరుగుదలను నమోదు చేసి, 13.2 వేల నౌకలకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని ఓడరేవుల ద్వారా ప్రయాణించే మొత్తం ప్రయాణీకుల సంఖ్య 2021లో 652,000కి చేరుకుంది. 2020 సంవత్సరంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 33% పెరిగిందని అథారిటీ తెలిపింది. మొత్తం ప్రయాణికుల సంఖ్యలో 71% మంది ప్రయాణికులతో జాజాన్ పోర్ట్ జాబితాలో తొలిస్థానంలో ఉన్నది.
తాజా వార్తలు
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!









