ఇండియన్ ఎంబసీలో ఘనంగా భారత జాతీయ ఐక్యతా దినోత్సవం

- November 01, 2022 , by Maagulf
ఇండియన్ ఎంబసీలో ఘనంగా భారత జాతీయ ఐక్యతా దినోత్సవం

కువైట్: భారత రాయబార కార్యాలయంలో భారత జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఎంబసీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. భారత జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా కువైట్‌లోని భారతీయులకు డా. వినోద్ గైక్వాడ్ ప్రారంభ ఉపన్యాసంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. భారత స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలకు ముందు వచ్చే 25 సంవత్సరాల అమృతకాల్‌కు పంచప్రాన్స్-5 సూత్రాలను నిర్దేశించారని,  ఇందులో ఐక్యత, ధర్మం ఒకటని భారత  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారని వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, పాటలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరితను ప్రదర్శించారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా భారత రాయబార కార్యాలయం కువైట్‌లోని భారతీయ పాఠశాలలతో కలిసి ప్రత్యేక ఐక్య మానవహారాలు, ఐక్కత పరుగు సహా అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో వందలాది మంది భారతీయ విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశంలో ఐక్యత, టీ ప్రత్యేక సంబంధాన్ని తెలిపే ప్రత్యేక Uni-TEA స్టాల్స్‌ను రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com