మనీలాండరింగ్ దోషులకు 18 సంవత్సరాల జైలు, SR500,000 జరిమానా

- December 03, 2022 , by Maagulf
మనీలాండరింగ్ దోషులకు 18 సంవత్సరాల జైలు, SR500,000 జరిమానా

సౌదీ: మనీ లాండరింగ్‌లో నేరం రుజువైన తర్వాత సౌదీ కోర్టు ఇద్దరు సౌదీలు,  ఒక అరబ్ జాతీయుడికి 18 సంవత్సరాల జైలు శిక్ష, SR500,000 జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. నేరానికి పాల్పడిన డబ్బుతో పాటు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జప్తు చేయాలని,  జైలు శిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాసిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.  పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన పరిశోధనల్లో మనీలాండరింగ్‌లో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులపై నేరారోపణలు నమోదు చేశారు. ఇద్దరు సౌదీలు వాణిజ్య సంస్థల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించారని, ఈ సంస్థల కోసం బ్యాంక్ ఖాతాలను తెరిచి, ఈ సంస్థల పేరుతో లావాదేవీలు చేపట్టడానికి వీలుగా వాటిని ప్రవాసులకు అప్పగించారని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు వాణిజ్య సంస్థల ఖాతాలపై జరిపిన ఆర్థిక పరిశోధనలలో ప్రవాసుడు పెద్ద మొత్తంలో డబ్బును ఖాతాలలో జమ చేసి, ఆపై వాటిని సౌదీ అరేబియా వెలుపల బదిలీ చేసినట్లు గుర్తించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com