ఒమన్ లో 1,000కు పైగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం
- December 19, 2022
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని బార్కాలోని విలాయత్లో 1,000 కంటే ఎక్కువ వెటర్నరీ కల్తీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. సౌత్ బటినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్.. వ్యవసాయం, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ సహకారంతో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించి వెటర్నరీ ఉత్పత్తులను విక్రయించే బర్కా విలాయత్ లోని కంపెనీపై దాడి చేసిందన్నారు. అక్కడ ఉత్పత్తుల గడువు తేదీలను మార్చి.. వాటికి కొత్త చెల్లుబాటు అయ్యే తేదీలను వేయడాన్ని గుర్తించామని సీపీఏ తెలిపింది. ఇతర గడువు ముగిసిన ఉత్పత్తులను కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. వినియోగదారుల రక్షణ చట్ట నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









