ఒమన్ లో 1,000కు పైగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం
- December 19, 2022
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని బార్కాలోని విలాయత్లో 1,000 కంటే ఎక్కువ వెటర్నరీ కల్తీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. సౌత్ బటినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్.. వ్యవసాయం, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ సహకారంతో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించి వెటర్నరీ ఉత్పత్తులను విక్రయించే బర్కా విలాయత్ లోని కంపెనీపై దాడి చేసిందన్నారు. అక్కడ ఉత్పత్తుల గడువు తేదీలను మార్చి.. వాటికి కొత్త చెల్లుబాటు అయ్యే తేదీలను వేయడాన్ని గుర్తించామని సీపీఏ తెలిపింది. ఇతర గడువు ముగిసిన ఉత్పత్తులను కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. వినియోగదారుల రక్షణ చట్ట నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







