ఒమన్ లో 1,000కు పైగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం
- December 19, 2022
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని బార్కాలోని విలాయత్లో 1,000 కంటే ఎక్కువ వెటర్నరీ కల్తీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. సౌత్ బటినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్.. వ్యవసాయం, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ సహకారంతో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించి వెటర్నరీ ఉత్పత్తులను విక్రయించే బర్కా విలాయత్ లోని కంపెనీపై దాడి చేసిందన్నారు. అక్కడ ఉత్పత్తుల గడువు తేదీలను మార్చి.. వాటికి కొత్త చెల్లుబాటు అయ్యే తేదీలను వేయడాన్ని గుర్తించామని సీపీఏ తెలిపింది. ఇతర గడువు ముగిసిన ఉత్పత్తులను కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. వినియోగదారుల రక్షణ చట్ట నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!







