ఆ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్రం తాజా మార్గదర్శకాలు
- December 30, 2022
న్యూ ఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. చైనా, హాంగ్ కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి.
జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఆయా దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ప్రకటించిన ఈ దేశాల నుంచి వచ్చే వారు, నిర్ణీత ప్రయాణ సమయానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష విధిగా చేయించుకుని, రిపోర్ట్ తో రావాల్సి ఉంటుంది. ఇక విదేశాల నుంచి వచ్చే మొత్తం ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్ గా ఇక్కడి విమానాశ్రయాల్లో నిర్వహించే ఆర్టీపీసీఆర్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!