సౌదీలో సందడిగా 'సంక్రాంతి ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలు
- January 09, 2023
సౌదీ: రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం సంక్రాంతి సంబరాలు - 2023 ఆధ్వర్యంలో శుక్రవారము "సంక్రాంతి ప్రీమియర్ లీగ్ " క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో "రియాద్ సూపర్ కింగ్స్ (మహేంద్ర వాకాటి నాయకత్వములో )", "సంక్రాంతి సన్ రైజర్స్ (ప్రసాద్ RVP)", "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్ (హేమంత్)", "తెలుగు టైటాన్స్ - రైడర్స్ (ఇబ్రహీం షేక్)" తలపడగా.. ఫైనల్స్ కు "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్", "తెలుగు టైటాన్స్ - రైడర్స్" చేరుకున్నాయి.ఫైనల్స్ మ్యాచులో "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్" విజేతగా నిలిచారు.
"సంక్రాంతి ప్రీమియర్ లీగ్ " క్రికెట్ పోటీలు విజయవంతమయ్యేందుకు సహకరించిన అన్ని జట్టుల ఆటగాళ్లకు, కుటుంబ సమేతముగా ఈ క్రికెట్ పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి "రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం" కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ క్రికెట్ పోటీలకు ప్రధమ బహుమతి, ద్వితీయ బహుమతి, ట్రోఫీస్ లను "సుఖేష్, గుత్తు ఇండియన్ రెస్టారెంట్, స్వామి, బిందు భాస్కర్", ఆటగాళ్లకు బహుకరించే మెడల్స్ ను "నరేంద్ర పెళ్లూరు'' ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ క్రికెట్ పోటీలలో పాలుగొన్న క్రీడాకారులకు "నాగేంద్ర, ఇబ్రహీం షేక్, శేషుబాబు" స్నాక్స్, అల్పాహారం సమకూర్చారు.గెలిచిన జట్టుకు, ఆడిన ఆటగాళ్లందరికి జనవరి 13వ తేదీన నిర్వహించే సంక్రాంతి సంబరాలలో బహుమతులను అందజేయనున్నారు.




తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







