ఒమన్ లో ఉద్యోగార్ధుల కోసం కొత్త యాప్
- January 09, 2023
మస్కట్: ఉద్యోగార్ధులు, జాతీయ శ్రామిక శక్తి, యజమానుల కోసం మాక్ లేదా ‘విత్ యూ’ యాప్ను కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) ప్రారంభించింది. ఇందులో ఉద్యోగార్ధుల కోసం 11 కంటే ఎక్కువ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పలువురు మంత్రులు, గవర్నర్లతో ఆదివారం కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి విధానం, గవర్నరేట్లలో పెట్టుబడులు, వృత్తులను స్థానికీకరించే మార్గాలు, ఈ రంగాలలో గవర్నరేట్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్ఇ డాక్టర్ మహద్ బిన్ సైద్ బిన్ అలీ బావోయిన్ మాట్లాడుతూ.. 2022లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో 35,000 ఉద్యోగాలను కల్పించినట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో మొదటి సారిగా లేబర్ మార్కెట్లో చేరిన ఉద్యోగార్ధుల సంఖ్య గత ఏడాది 20,000 దాటిందని, 2021తో పోల్చితే 2022లో ఉద్యోగ భద్రత నిధి నుండి లబ్ది పొందుతున్న వారి సంఖ్య దాదాపు 3,000 పెరిగిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ 2022 చివరి నాటికి దేశంలో 85,000 మందికి పైగా ఉద్యోగార్ధులు ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









