ఒమన్ లో ఉద్యోగార్ధుల కోసం కొత్త యాప్
- January 09, 2023
మస్కట్: ఉద్యోగార్ధులు, జాతీయ శ్రామిక శక్తి, యజమానుల కోసం మాక్ లేదా ‘విత్ యూ’ యాప్ను కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) ప్రారంభించింది. ఇందులో ఉద్యోగార్ధుల కోసం 11 కంటే ఎక్కువ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పలువురు మంత్రులు, గవర్నర్లతో ఆదివారం కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి విధానం, గవర్నరేట్లలో పెట్టుబడులు, వృత్తులను స్థానికీకరించే మార్గాలు, ఈ రంగాలలో గవర్నరేట్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్ఇ డాక్టర్ మహద్ బిన్ సైద్ బిన్ అలీ బావోయిన్ మాట్లాడుతూ.. 2022లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో 35,000 ఉద్యోగాలను కల్పించినట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో మొదటి సారిగా లేబర్ మార్కెట్లో చేరిన ఉద్యోగార్ధుల సంఖ్య గత ఏడాది 20,000 దాటిందని, 2021తో పోల్చితే 2022లో ఉద్యోగ భద్రత నిధి నుండి లబ్ది పొందుతున్న వారి సంఖ్య దాదాపు 3,000 పెరిగిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ 2022 చివరి నాటికి దేశంలో 85,000 మందికి పైగా ఉద్యోగార్ధులు ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







