యూఏఈ-అల్ సుహబ్ రహదారి మూసివేత
- January 09, 2023
యూఏఈ: యూఏఈ నుంచి ఖోర్ఫక్కన్లోని అల్ సుహబ్ రెస్ట్ ఏరియాకు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు షార్జా పోలీసులు ప్రకటించారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విశ్రాంతి గృహానికి వచ్చిన సందర్శకులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు వరుస ట్వీట్ లలో ధృవీకరించారు. సందర్శకులను కిందకు తీసుకు వచ్చేందుకు వీలుగా రహదారిలో పడిఉన్న బండరాళ్ల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రెస్ట్ స్టాప్ 2021లో ప్రజల కోసం ప్రారంభించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







