యూఏఈ-అల్ సుహబ్ రహదారి మూసివేత
- January 09, 2023
యూఏఈ: యూఏఈ నుంచి ఖోర్ఫక్కన్లోని అల్ సుహబ్ రెస్ట్ ఏరియాకు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు షార్జా పోలీసులు ప్రకటించారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విశ్రాంతి గృహానికి వచ్చిన సందర్శకులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు వరుస ట్వీట్ లలో ధృవీకరించారు. సందర్శకులను కిందకు తీసుకు వచ్చేందుకు వీలుగా రహదారిలో పడిఉన్న బండరాళ్ల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రెస్ట్ స్టాప్ 2021లో ప్రజల కోసం ప్రారంభించారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









